గుర్రంపోడ్:సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి).././ మోత్కూరు మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన కొణతం శ్రీనివాస్ గత 8 నెలల నుండి పక్షవాతంతో మంచానికి పరిమితమై కుటుంబ పోషణ కష్టంగా మారింది.ఈ విషయం తెలుసుకున్న జనయేత్రి ఫౌండేషన్ సభ్యులు గురువారం నల్లగొండలోని బస్ స్టేషన్ వద్ద శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఒక నెలకు సరిపడా బియ్యం,నూనె, పప్పులు మొదలైన నిత్యవసర సరుకులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జనయేత్రి ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు గాదె నరసింహ, ఉపాధ్యక్షురాలు కంబాల శివలీల, కార్యవర్గ సభ్యులు బూరెల ప్రభాకర్,పరాంకుశం,అమీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
- 2 views