మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:01
An insane person committed suicide by jumping into a well

సిరికొండ సెప్టెంబర్ 24, (ప్రజా జ్యోతి) .య మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒకటి సిరికొండ మండల కేంద్రంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిరికొండ గ్రామానికి చెందిన కత్తెర్ల కుమార్ (35) గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు ఇందులో భాగంగా గ్రామ సమీపంలోని ఒక బావిలో శుక్రవారం సాయంత్రం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో శనివారం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు .ఈ మేరకు పోలీసులు కత్తెర్ల కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.