నిర్లక్ష్యం వల్లే గాయాలు....!! - టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేష్ యాదవ్

Submitted by kareem Md on Thu, 29/09/2022 - 13:26
Injuries due to negligence...!! - TRSV State Secretary Challa Kotesh Yadav


హలియా,సెప్టెంబర్28(ప్రజా జ్యోతి):  వంట మనిషి నిర్లక్ష్యం చేత విద్యార్థి శరీరం కాలి బొబ్బలు వచ్చాయని టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేష్ యాదవ్ ఆరోపించారు.బుధవారం గంజి పడి గాయాల పాలై జిల్లా జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చండూరు సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థి తంగిరాల మనోహర్ ను పరమార్శించి ఆరోగ్య పరిస్థితిలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద విద్యార్థులకు ఉన్నత విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించుటకు పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసి, ఒక్క విద్యార్థికి లక్ష రూపాయల పైచిలుకు ఖర్చు చేస్తుంటే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా సరియైన పర్యవేక్షణ లేక పోవడం తో వంట మనిషి ఇష్టా రీతిలో వ్యవహరించి వేడి అన్నం పాత్రను విద్యార్థి చే క్రిందికి దింపించడం మూలాన సంఘటన చోటుచేసుకుందన్నారు. ఇటువంటి సంఘటనలు గురుకుల పాఠశాలలో జరగటం దురదృష్టకరమన్నారు.ఇట్టి సంఘటనపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తగు చర్యలు తీసుకొని విద్యార్థికి మెరుగైన వైద్యం అందేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి జిల్లా నాయకులు మిరియాల సైదులు,నాగార్జున సాగర్ నియోజకవర్గ టిఆర్ఎస్వి అధ్యక్షుడు కుంటి గొర్ల లింగయ్య యాదవ్,ఎక్కలూరి వెంకట్ రెడ్డి,మేక శ్రీధర్ రెడ్డి భత్తుల కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.