కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

Submitted by narmeta srinivas on Sat, 19/11/2022 - 19:06
ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నేత ఇందిరమ్మ : ధరావత్ సురేష్ నాయక్

ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నేత ఇందిరమ్మ : ధరావత్ సురేష్ నాయక్

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 19 :  భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా శనివారం కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ అధ్వర్యంలోఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ స్త్రీలకు గౌరవం తెచ్చే విధంగా ప్రపంచ సమాజంలో,ముఖ్యంగా మహిళా సాధికారత సంస్థ నుండి అపారమైన గౌరవాన్ని పొందారని, భూ సంస్కరణ చట్టం తీసుకోచ్చి,పెద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని, గరిభి హఠవో నినాదంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేసిన ప్రయత్నం ఇప్పటికి మర్చిపోలేనిదని గుర్తుచేశారు, రాజకీయాల్లో కొత్తదనం చూపించి ధీరత్వానికి మారు పేరుగా నిలిచిన మహా నాయకురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు. పాలన అంటే ఇందిరమ్మ రాజ్యంలా ఉండాలనే విధంగా జనరంజక పాలన చేసి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నేత అని పేరుకొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె ముంతల సోమ నరసయ్య, కొడకండ్ల పట్టణ అధ్యక్షులు మసురం రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి మురారిశెట్టి అంజయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధర్మారపు బిక్షపతి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు వలబోజు రమేష్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి కలీం, మసురం మనోహర్ ,జాటోత్ రాము నాయక్ , మండల కార్యదర్శి ఐతరాజు, మండల ఎస్సీ సెల్ నాయకుడు జక్కుల  సంజీవ, దోర్నం సోమయ్య, రంగయ్య, శ్రీనివాస్, అందె బయన్న, నజీర్, ఉల్లి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.