అనంతగిరి

నులిపురుగుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి -డాక్టర్ లక్ష్మీ ప్రసన్న

Submitted by sai teja on Thu, 15/09/2022 - 10:23

అనంతగిరి, సెప్టెంబర్14, ప్రజా జ్యోతి: నులిపురుగుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని డాక్టర్ లక్ష్మీ ప్రసన్న బుధవారం ఓ ప్రకటన లో తెలియజేసారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15 వ తారీఖు జాతీయ నులిపురుగుల నిర్ములన దినోత్సవ సందర్భంగా మండల వ్యాప్తంగా  పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలు, కళాశాల యందు 1 నుండి 19 సంవత్సరాల బాలబాలికలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది,కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తమ దగ్గరలోని ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కేంద్రాల వద్ద పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి నులిపురుగుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి