రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఉన్నత పాఠశాల విద్యార్థులు

Submitted by narmeta srinivas on Fri, 25/11/2022 - 18:29
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఉన్నత పాఠశాల విద్యార్థులు

అభినందించిన గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజా జ్యోతి) నవంబర్ 25 : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కొడకండ్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మద్దెబోయిన అభిలాష్ అండర్ 16, గజ్జి మనస్విని అండర్ 12, లాంగ్ జంప్ ఈవెంట్లో ఎంపికయ్యారు. ఈనెల 22న జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. డిసెంబర్ 5, 6 తేదీలలో హైదరాబాదులోని గచ్చిబౌలి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను గ్రామ సర్పంచ్ పసునూరి మధుసూదన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై. గ్రేస్ కేజియా రాణి, ఫిజికల్ డైరెక్టర్ గోర్ సింగ్, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ లింగయ్య, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.