గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

Submitted by SANJEEVAIAH on Wed, 10/05/2023 - 13:35
Photo

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి


 జక్రాన్ పల్లి, ప్రజాజ్యోతి, మే 8 :

 

మండలంలోని సికింద్రాపూర్ వద్ద గల జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని కేశ్ పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మీ(50) మృతి చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కేశ్ పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మీ, అదే గ్రామానికి చెందిన యటకర్ల సతెమ్మ ఇద్దరు కలిసి పోచపాడ్ గోదావరి నది స్నానం నిమిత్తం బుధవారం ఉదయం 8 గంటలకు బయలుదేరారు. సింద్రాపూర్ వద్ద బస్సు ఎక్కడానికి రోడ్డు దాటుతుండగా డిచ్ పల్లి వైపు నుండి ఆర్ముర్ వైపు వెళుతున్న గుర్తుతెలియని కారు ఢీకొట్టి పోవడంతో కుమ్మరి లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. మృతురాలు లక్ష్మీ కి పిల్లలు లేరు ఇమే ఒంటరి మహిళ వరుసకు కూతురగు కొత్తపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు..