వాహన తనిఖీ ల్లో గుడుంబా పట్టివేత

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:38
Gudumba arrest in vehicle inspections

వెంకటాపురం (నూగూరు) అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి) ./...ములుగు జిల్లా, వెంకటాపురం మండల పరిధిలోని ఆలుబాక సమీప ప్రాంతము లో  శనివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా చర్ల వైపు నుండి వెంకటాపురం వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు వస్తుండగా అపి తనిఖీ చేయగా వారి వద్ద సంచులను పరిశీలించి చూడగా సుమారు 120 లీటర్ల నాటుసారా ను గుర్తించారు.1)భుక్యా రాంబాబు (సుజ్ఞానపురం దుమ్ముగూడెం) 2)ముమ్మనేని బాబురావు (ఉప్పేడు వీరాపురం) 3)వల్లేపోగు గణేష్ (కొత్తపల్లి చర్ల)4) చల్లూరి శేషుకూమార్ (ఉప్పేడు వీరాపురం) ను అదుపులోకి తీసుకున్నారు.రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎక్సైజ్ శాఖ కు అప్పజెప్పడం జరుగుతుందని ఎస్సై తిరుపతి తెలిపారు.ఈ తనిఖీ ల్లో  పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.