ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 12:09
 Grand National Unity Diamond Jubilee celebrations

దేవరకొండ పట్టణంలో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భారీ ఎత్తున  పాల్గొన్న ఉద్యోగులు, ప్రజలు, మహిళలు, రాజకీయ నాయకులు, విద్యార్థులు 

 సెప్టెంబర్ 16( ప్రజా జ్యోతి) జాతీయ సమగ్రతకు మార్గదర్శనం ముఖ్యమంత్రి కెసిఆర్  అని  దేవరకొండ శాసనసభ్యులు    టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారంరోజు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ గ్రౌండ్  నుండి నిర్వహించిన భారీ  ర్యాలీలో ప్రజలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులతో పాటు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.అనంతరం జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక అని   అది యావత్ భారతదేశానికి చాటిచెప్పేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు.అన్ని రంగాలలో యావత్ భారతదేశానికి తెలంగాణ ప్రతీక అని ఆయన అన్నారు. కుల మతాల పేరుతో బిజెపి కుట్ర చేస్తోందని బిజెపి ఉచ్చులో తెలంగాణ సమాజం పడొద్దని ఆయన తెలిపారు.సెప్టెంబర్ 17 జరుపుకునేది ముమ్మాటికి జాతీయ సమైక్యతా దినోత్సవం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరాం ,డీఎస్పీ నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మెన్ అల్లంపల్లి   నర్సింహా, మార్కెట్ కమిటీ చైర్మన్ చిరందాసు లక్ష్మమ్మ, ఎంపిపిలు గల్ల    గసు జాన్ యాదవ్, మాధవరం సునీత జనార్దన్రావు,  రాజీనేని వేంకటేశ్వర్రావు, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.