ఘనంగా మూలా నక్షత్ర దీపోత్సవం

Submitted by bheemaraidu on Mon, 03/10/2022 - 13:22
 Grand Moola Nakshatra Deepotsavam

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) అక్టోబర్ 02 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మూలా నక్షత్ర దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం దేవాలయంలో పంచామృతాభిషేకాలు, ద్విపోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవిని, శారదా దేవి అలంకరణలో పూజా కార్యక్రమం జరిగింది. శ్రీనివాస సిద్ధాంతి, శ్రీనివాస కళ్యాణం గురించి భక్తులకు పురాణ ప్రవచనాలు వినిపించారు. ఈ సందర్భంగా దేవాలయంలో గట్టు గోవిందరావు బ్రదర్స్ పులిహోర కోట ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. గద్వాలకు చెందిన కేశవకుమార్ (వైభవ్ ఆదిత్య ఐ క్లినిక్) అనే భక్తుడు 230 గ్రాముల వెండిని స్వామివారికి బహుకరించగా ఆలయ చైర్మన్ స్వీకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్కూరు రాఘవేంద్రరావు, బిజెపి రాఘవేంద్రరావు, అరవిందరావు, చంద్రశేఖర రావు, చంద్రశేఖర్ రెడ్డి, బాబురావు, గోవిందరావు భక్తులు పాల్గొన్నారు.