ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Submitted by Degala Veladri on Mon, 03/10/2022 - 00:25
Grand Gandhi Jayanti celebrations under the auspices of the Arya Vaishya Sangam

పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ఎస్సై కవిత

బోనకల్, అక్టోబర్ 02 , ప్రజాజ్యోతి: ఆదివారం మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గాంధీ విగ్రహం వద్ద బోనకల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోనకల్ ఎస్సై తేజవత్ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్ర కీలకమని,ఇతర దేశాలలో కూడా గాంధీజీ సిద్ధాంతాలను కొనియాడుతారని, నేటి యువత గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించి భారతదేశ భవిష్యత్తుకు బాటలు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్,ఎం.పి.పి కంకణాల సౌభాగ్యం, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు,మాజీ జడ్.పి.టి.సి బానోతు కొండా, తెలుగుదేశం మండల అధ్యక్షుడు రావట్ల సత్యనారాయణ ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు చెడే వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షుడు డేవిడ్, బోనకల్ సిపిఎం గ్రామ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు రంగా నాగేశ్వరరావు గుర్రం పూర్ణచంద్రరావు పల్లపోతుల గోపి చెడే జనార్ధన్ రాయపూడి శ్రీనివాసరావు, కటకం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.