ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:28
Grand Gandhi Jayanti celebrations

 గూడూరు అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి):  మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో తాసిల్దార్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి తాసిల్దార్ అశోక్ కుమార్ పూలమాలసి ఘనంగా వేడుకలు జరిపారు గూడూరు గాంధీ సెంటర్లో గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం బిజెపి పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు అనంతరం మాట్లాడారు. సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా  ఆ మహానీయుడికి ఘన నివాళులు  అర్పించడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు వాంగ్డోత్ మోతిలాల్ గూడూరు మండల  టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు నూకల సురేందర్ యాదవ్ గూడూరు టౌన్  టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చీదురు వెంకన్న గూడూరు మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాంకుడోత్ కటార్ సింగ్ మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి రహీం పాషా మాజీ టౌన్ అధ్యక్షులు ఎదునూరి వెంకన్న మండల ఉపాధ్యక్షులు  ఒగ్గుల విజయ్ గూడూరు మండల టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బోడ ఎల్లయ్య  లైన్ తండ  టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దారవతు కిషన్ నాయక్, మండల నాయకులు ప్రశాంత్ నాయక్, బోంత రాములు, సంపంగి రాములు, గుగ్గిల నరసింహ, బద్రు నాయక్, నూకల శ్రీనివాస్ యాదవ్, మండల కుమారు యాదవ్, నాయిని ఐలయ్య, బత్తుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.