భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్ 27 ప్రజాజ్యోతి. స్వాతంత్ర్య సమరయోధుదు, తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మంగళ వారం నాడు ఘనంగా నిర్వహించారు.కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి జేసి స్వర్ణలత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు తరాల పోరాటాలకు ఆయన ఆదర్శు డని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిని శైలజ, డి.పి.ఆర్.ఓ. వి. శ్రీధర్, ఏఓ మహేశ్ బాబు , బి.సి.సంఘ నాయకులు బి.సత్యనారాయణ , అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- 11 views