పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి...: టిపిటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగల్ల సురేష్

Submitted by SANJEEVAIAH on Wed, 10/05/2023 - 13:24
News

పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి

టిపిటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగల్ల సురేష్

నిజామాబాద్ సిటీ, ప్రజాజ్యోతి, మే 10 :

గత పదమూడు రోజులుగా ఆందోళన చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగల్ల సురేష్ డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ ధర్నా చౌక్ లో సహయ కార్యదర్శుల దీక్ష శిబిరాన్ని టిపిటిఎఫ్ ప్రతినిధులు సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు వెనిగల్ల సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ళలో రెగ్యులర్ చేస్తామని, ఇప్పుడు చేతులు ఎత్తివేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పడం శోచనీయమని అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేసి, గ్రామాలలో కుంటు పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అరవింద్, గంగాప్రసాద్, గోపి తదితరులు పాల్గొన్నారు.