ప్రతి యేట ఆడపడుచులకు బతుకమ్మ చీరలు..
మండల పరిషత్ వైస్ ఎంపీపీ స్వరూపారెడ్డి
తాండూరు సెప్టెంబర్ 27 ప్రజా జ్యోతి :- ఆడపడుచుల సంతోషం కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతి యేట దసరా పండుగ సందర్భంగా నిర్వహించే బతుకమ్మ సంబరాలకు ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరలు అందజేయడం జరుగుతుందని తాండూరు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు స్వరూప రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామ సర్పంచ్ కురువ నాగర్జున ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మండల పరిషత్తు ఉపాధ్యక్షురాలు స్వరూప వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి పండుగకు కుల మాతాల బేధాలు లేకుండా పేదవాళ్లకు బట్టల పంపిణీ కార్యక్రమం చేసినట్లే దసరా పండుగలో భాగంగా జరుపుకునే శరన్నవరాత్రి ఉత్సవాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకునేందుకు ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్మకన్య పిఎసిఎస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు సావిత్రమ్మ, లావణ్య, భాస్కర్, విగ్నేష్, గ్రామ పెద్దలు నర్సింలు, నర్సయ్య, గ్రామ కార్యదర్శి జి లాలాప్ప, అంగన్వాడీ టీచర్స్ ఉమా దేవి,కృష్ణ వేణి, ఆశా కార్యక్రతలు లక్ష్యం భాయ్, రేషన్ డీలర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాల్గొన్నారు.
- 29 views