- 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెలించాలి
- బి యస్ పి మండల కన్వీనర్. వెంకట్
- పలిమెల ప్రజాజ్యోతి సెప్టెంబర్ 2
రామగుండం ఎరువుల కర్మాగార ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగం పేరిట మోసపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ముంజ హరీష్ గౌడ్ కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహరంతో పాటు తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బీఎస్పీ మండల అధ్యక్షుడు వెంకట్ డిమాండ్ చేశారు.
ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని ఆందోళన చేపట్టారు .ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూl ఆర్ ఎఫ్ సి ల్ లో ఉద్యోగం పేరిట డబ్బులు వసూలు చేసి మోసం చేసిన రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని మరియు అదే విధంగా మోసపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన బాధితుడు ముంజ హరీష్ గౌడ్ కుటుంబంనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 50 లక్షల ఎక్స్ గ్రేషియా తో పాటు తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముంజ హరీష్ గౌడ్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ,పలిమేల మండల సెక్టర్ అధ్యక్షులుతోలం శ్రీనివాస్ మండల జనరల్ సెక్రెటరీ జనగామ రామ్మూర్తి మండల కో కన్వీనర్ దుర్గం గోపి పంకెన గ్రామ కన్వీనర్ జాడి భాస్కర్ వినయ్ తిప్పన పల్లి రమేష్ నరసింగరావు తమ్మడి రాజు చింతల అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు
- 1 view