గుర్రంపోడ్:సెప్టెంబర్ 14(ప్రజా జ్యోతి) గుర్రంపోడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విశిష్టమైన సేవలు అందించిన శ్రీపాద సుధాకర్ ఇటీవల చండూరు మండలానికి బదిలీ అయిన సందర్భంగా బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు ఎంపీడీవో సుధాకర్ ను శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా మంచికంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎంపీడీవో సుధాకర్ మండల అభివృద్ధి అధికారిగా పనిచేసి ప్రజాప్రతినిధులతో కలుపుగోలుగా ఉంటూ మండలాభివృద్ధికి విశేషమైన కృషి చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి,స్థానిక సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు,పంచాయితీ కార్యదర్శులు,మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది సూపరింటెండెంట్ అండాలు,సీనియర్ అసిస్టెంట్ రవి,జూనియర్ అసిస్టెంట్ రావుల వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- 5 views