సరస్వతి దేవిఅవతారంలో..కనకదుర్గ అమ్మవారు

Submitted by venkat reddy on Mon, 03/10/2022 - 10:43
Goddess Saraswati in avatar..Kanakadurga

నిడమనూరు, అక్టోబర్02(ప్రజాజ్యోతి):  తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమై ఏడొవ రోజుకు చేరుకుంది.ఆదివారం  కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతి దేవిఅవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి వేడుకలు ఏడొవ రోజు కొనసాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో రాజన్నగూడెం,నారమ్మగూడెం‌,తుమ్మడం రేగులగడ్డ,సోమవారిగూడెం, పార్వతీపురం గ్రామాల్లోని కనకదుర్గమ్మ ఆలయం భక్తులకు మహ అద్బుతంగా దర్శనమిస్తున్నాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి స్వర్ణకలశ  తొలి దుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు నవరాత్రుల్లో దుర్గామాత తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో దర్శనం ఇస్తుంది. ఆశ్వీయుజ శుద్ధ  పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తున్నారు. ఆదివారం సరస్వతి దేవిఅవతారంలో భక్తులకు కనకదుర్గమ్మ వారు దర్శనమిచ్చారు.ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదొవ రోజు మహిషాసురమర్థిని అలంకరణ సాయంత్రం శివ పార్వతుల శాంతికళ్యాణం,ఉరేగింపు భక్తులను అనుగ్రహిస్తారు.

దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఏడాది కూడా భక్తులు  అధిక సంఖ్యలోవస్తారని అంచనా అధికారులు వేశారు. అందుకు తగ్గట్టుగానే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలు సిద్ధం చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ,మోహన్ శర్మ, రాజన్నగూడెం ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.