సూర్యాపేట టౌన్ 30 సెప్టెంబర్ ( ప్రజా జ్యోతి)./... శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట పట్టణం 22 వార్డులో కొలువై ఉన్న అమ్మవారు శుక్రవారం లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రులలో ఐదవ రోజు చాలా విశేషమైనదని పూజారి వినోద్ తెలిపారు. లలితా దేవిని కళలకు,సౌభాగ్యానికి ప్రతికగా పిలుస్తారని పేర్కొన్నారు .ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కుంకుమ పూజను నిర్వహించారు. ఈ కుంకుమ పూజలో వార్డు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో కమిటీ సభ్యులు గోనె విజయ, రేబేల్లి సుజాత, కడియం విజయ, బుక్క వెన్నెల, పాశం రమ్య, ఉమామహేశ్వరి, పద్మజ తదితరులు పాల్గొన్నారు
- 1 view