రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి:కూన్ రెడ్డి నాగిరెడ్డి.

Submitted by venkat reddy on Thu, 22/09/2022 - 14:24
Give victory to Rythu Sangam Zilla Mahasabhas: Koon Reddy Nagireddy.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 21(ప్రజా జ్యోతి)..// సెప్టెంబర్ 22 వ తేదీ న మిర్యాలగూడలో జరిగే తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో తెలంగాణ రైతు సంఘం రెండవ మండల మహా సభలను ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా  కూన్ రెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి స్వామినాథన్ కమీషన్ ప్రకారం మద్దతు ధర ప్రకటించకుండా 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ ఆదాయం రెట్టింపు చేయకపోగా ఖర్చులను రెట్టింపు చేశాడని అన్నారు. విత్తనాలు,ఎరువులు పురుగు మందుల ధరలు మూడింతలు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని అలాగే పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాడని,దేశంలో మోడీ పాలన దుర్మార్గంగా ఉందని అన్నారు. రైతులంతా ఏకమై మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతన మండల అధ్యక్ష కార్యదర్శులుగా వనమాల కామేష్,పోలేపల్లి రమేష్ లను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి,నరసయ్య,మల్లయ్య, లక్ష్మయ్య,శంకర్రావు,రామాంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.