గంగాపురం లింగమయ్య గౌడ్ సంతాపం తెలుపుతున్న సిపిఐ రాష్ట్ర నాయకులు

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 13:08
Gangapuram Lingamaiah Goud mourns CPI state leaders

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 1 ( ప్రజా జ్యోతి) సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన సిపిఐ నాయకుడు గంగాపురం లింగమయ్య గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వల్ల వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నాడు మండల కేంద్రం లో లింగమయ్య గౌడ్ మృతికి సంతాపం తెలిపారు . కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.  అనంతరం మాట్లాడుతూ లింగమయ్య గౌడ్ అనేక ఉద్యమాలను ముందుండి  నడిచారని, నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినట్టు తెలిపారు ,ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తపించేవారని కొనియాడారు. శవయాత్రలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కే శ్రీనివాస్, సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం,  మాజీ సర్పంచ్ దేశిడి నరేందర్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి బచ్చనగోని గాలయ్య యాదవ్, గ్రామ కార్యదర్శి చెలివేరు అంజయ్య, పబ్బు మాధవులు,  దుబ్బాక భాస్కర్ , పల్లె మల్లారెడ్డి,  కలకొండ సంజీవ, మోగుదాల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.