స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 02 చిల్పూర్ ( ప్రజాజ్యోతి ) : - మండలంలోని పల్లగుట్ట గ్రామములో చిల్పూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు సహకారంతో సేనర్జియా గ్రూప్ చైర్మన్ బ్రదర్ జాన్ ఆధ్వర్యంలో ఆదివారం జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి వృద్దులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసారు. అనంతరం సెనర్జీయా గ్రూప్ వారు గ్రామ కార్యదర్శి నరసింహా చారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామ కార్యదర్శి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొట్టు మానస, ఎంపీటీసీ ఝాన్సీ, మాజీ జడ్పీటీసీ బాశెట్టి వనజా, పిఏసిఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, గ్రామ కార్యదర్శి నరసింహా చారి, ఉప సర్పంచ్ బత్తిని శ్రీను, స్కూల్ చైర్మన్ మర్రి శ్రీధర్, తెరాస పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, బొట్టు చేరాలు, జీడీ ఆనందం, వేల్పుల గట్టయ్య, ధార రవి, గ్రూపు సభ్యులు అశోక్ పాల్, అనిల్ రూబెన్, హన్మకొండ రాజు, ఇసురం కృష్ణా, ఉపేందర్, గుర్రపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- 24 views