అర్హులైన పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళు లు ఇవ్వాలి

Submitted by sridhar on Tue, 13/09/2022 - 11:59
Free double bedroom houses should be given to the deserving poor


వెంకటాపురం ( నూగూరు) సెప్టెంబర్ 12 ( ప్రజా జ్యోతి) మండల కేంద్రంలో వెంకటాపురం మండల కమిటీ ఆధ్వర్యంలోసిపిఎం పార్టీ కార్యాలయం లో మండల కమిటీ సమావేశం గ్యానంవాసు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి  పార్టీ రాష్ట్ర కంట్రోలర్ కమీషన్ చైర్మన్ భద్రాచలం మాజీ ఎంపీ  మిడియంబాబురావు హాజరయ్యారు.ఈసందర్భంగావారు మాట్లాడుతూ  మండలంలో గోదావరి ముంపు బాధితులకు ఇంత వరకు సరిగా నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. అంతేకాకుండా సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇచ్చే దళితులకు దళితభందు సక్రమంగా దళితులకు ఇవ్వాలని అన్నారు,

అర్హులైన పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మలవెంకటరెడ్డి, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ మచ్చావెంకటేశ్వరరావు,  మండల కార్యదర్శి కుమ్మరిశ్రీను,గుండమల్ల ప్రసాద్, మాణిక్యం, కృష్ణ, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు