క్రీడలు సామాజిక స్పృహకు నాందిఊర్కొండపేట సర్పంచ్ అనితనాగోజి
ఉర్కొండ సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి),../,,మండలంలోని ఊర్కొండపేట గ్రామంలో బుదవారం మాజీ ఎంపీటిసి టీ చంద్రమౌళి స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఊర్కొండపేట, నర్సంపల్లి సర్పంచులు అనితనాగోజి నిరంజన్ గౌడ్ ముఖ్య అథితులుగా పాల్గొని మొదటి మ్యాచ్ ఊర్కొండపేట సీబీఐ ముచ్చార్లపల్లి ఇరు జట్లతో పరిచయం చేసుకొని ట్రాస్ వేసి క్రీడలను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక మానసిక సామాజిక స్పృహ లక్షణాలను పెంపొందించే సాధనంగా క్రీడలు ఎంతో దోహద పడతాయని క్రీడా స్ఫూర్తితో గెలుపు ఓటములను యువత సమానంగా భావించి ముందుకెళితే వ్యక్తిత్వ వికాసంతో గమనాన్ని గమ్యాన్ని సాధించవచ్చని అన్నారు మాజీ ఎంపీటీసీ స్వర్గీయ టీ చంద్రమౌళి బడుగు బలహీన వర్గాలకోసం ఎంతో కష్టపడ్డారని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కవేనని అలాంటి గొప్ప నాయకుడి స్మరించుకుంటూ ఈ టోర్నమెంట్లో అడటం గర్వదగ్గ విషయంమని అన్నారు ఈ కార్యక్రమంలో జాఫర్ గోపాల్ షబ్బీర్ జహంగీర్ ఖదీర్ రసూల్ ఇబ్రహీం జహీర్ వార్డు సభ్యులు శ్రీను సిద్దు ఉర్కొండ మాజీ సర్పంచ్ మేకల శ్రీనివాసులు స్వర్గియ చంద్రమౌళి అభిమానులు యువకులు క్రీడాకారులు పాల్గొన్నారు.
- 13 views