సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Submitted by mallesh on Fri, 30/09/2022 - 16:25
Former MLA Kusukuntla Prabhakar Reddy should enter CM KCR's national politics

చౌటుప్పల్ సెప్టెంబర్ 30 ( ప్రజా జ్యోతి) ./... ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి చేరితే ,తెలంగాణలో అందజేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలవుతాయని, ప్రజలు సీఎం కేసీఆర్ ను దేశ రాజకీయాల్లో రావాలని, కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.శుక్రవారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కుంట్ల గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాల విటల్, దోర్నాల రామస్వామి, బాల చంద్రయ్య, కర్నాటి శ్రీనివాసులు తో పాటు 100 మంది కార్యకర్తలను టిఆర్ఎస్ పార్టీలోకి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిర్కంటి నిరంజన్ గౌడ్, మిరియాల పారిజాత గోపాల్, పర్యగోని పాండు, అనిల్ కుమార్, మల్లెబోయిన లక్ష్మయ్య, శేఖర్, లింగస్వామి, బండి జగన్, రమేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.