మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

Submitted by Degala shankar on Thu, 22/09/2022 - 11:49
Former market committee director visited the family  Chairman of the District Library Association

సిర్పూర్ (యు) జడ్పిటిసి 

జైనూర్ సెప్టెంబర్ 21:(ప్రజా జ్యోతి):మండల కేంద్రంలోని అందు గూడా గ్రామానికి చెందిన పవర్ రవి టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త తండ్రి,మాజీ మార్కెట్ కమిటీ సభ్యుడు బిక్షానాయక్ ఇటీవల్ల గుండెపోటుతో మరణించారు. ఆయన స్వగ్రామానికి వెళ్లి కుటుంబీకులను బుధవారం పలువురు ప్రతినిధులు పరామర్శించారు. బిక్షా నాయక్  చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ పరామర్శించిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్ రావు, సిర్పూర్ యు జడ్పిటిసి కోవా అరుణ, నాయకులు తిరుపతి, బాబు వన్, విశ్వనాథ్, టీఆర్ఎస్ అధ్యక్షులు ఉత్తం నాయక్, పలువురు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులున్నారు.