సంగాల చెరువులో చేప పిల్లలను వదిలిన జెడ్పి చైర్ పర్సన్,ఎమ్మెల్యే

Submitted by sridhar on Mon, 05/09/2022 - 14:58
The fish left in the Sangala pond ZP Chairperson, MLA

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 05: గద్వాల నియోజకవర్గ పరిధిలోని సంగాల చెరువులో 2022-2023 సంవత్సరమునకు 100 శాతం రాయితీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఆదేశాల మేరకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై సంగాల చెరువులో  మత్స్యకారులతో కలిసి చేప పిల్లలను వదిలారు.

అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత కుల వృత్తులకు పెద్దపీట వేసిందని,అని జాతుల అభివృద్ధికి ‌రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ,ఎంపిపి ప్రతాప్ గౌడ్,సింగిల్ విండో ఉమ్మడి జిల్లా సుభాన్, మత్స్యకారుల సంఘం నాయ కౌన్సిలర్ శ్రీను, డిటిటిసి నరసింహ, వెంకట్రాములు,వంట శ్రీను,డబ్లెటి నరసింహ, చిన్న,డ్రైవర్ రాములు జిల్లా మత్స్యకారుల అధికారిని షాకీల బాను తదితరులు ఉన్నారు.