ఆర్థిక సాయం అందజేత

Submitted by Upender Bukka on Fri, 16/09/2022 - 15:08
Financial aid provider

తిరుమలగిరి టౌన్, సెప్టెంబర్ 16, (ప్రజా జ్యోతి );  తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని బిసి కాలనీ కి చెందిన బండారి శ్రీను ముదిరాజ్ మరణించిన విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమ కారుడు, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మెన్  తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ బీసీ కాలనీ కి వెళ్లి  శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి, 5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. పేద కుటుంబాలకు ఆరాధ్య ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు .ఈ కార్య క్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.