- సౌహృదయం తో స్పందించిన
- మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి
- కాడెద్దుల సహాయార్థం 10,000 రూపాయలు
కొత్తూరు సెప్టెంబర్ 05 (ప్రజా జ్యోతి)కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన ముట్పూరి కృష్ణయ్య కాడెద్దులను పదిహేను రోజుల క్రితం కట్టేసిన చోటు నుండే రాత్రికి రాత్రే అపహరించిన దుండగులు అట్టి విషయాన్ని ప్రజా జ్యోతి దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించి మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి సౌహృదయం తో కాడెద్దుల సహాయార్థం 10,000 రూపాయలు అందజేశారు.
మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ కాడెద్దులను కోల్పోయిన రైతు పరిస్థితి వాటినే నమ్ముకుని వ్యవసాయ కూలీ చేస్తున్నందున దుండగులు కాడెద్దులను అపహరించడంతో రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నందున ప్రజా జ్యోతి పత్రిక ద్వారా ఈ విషయం వెలికి రావడంతో నేను ఆర్థిక సహాయం 10,000 ప్రకటించడం జరిగింది. కూలి రైతు కృష్ణయ్య మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపినాడు.
- 4 views