తహసీల్ధార్ : కోలా చంద్రమోహన్
పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 21 : 2016 వ సంవత్సరానికి ముందు ఆధార్ కార్డు దిగిన ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని కొడకండ్ల మండల తహసిల్దార్ కోల చంద్రమోహన్ సూచించారు. సోమవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆధార్ జీవితాన్ని సులభరతరం చేస్తుంది అనే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు అన్ని అవసరాలకు చాలా శక్తివంతమైనదని అన్నారు. జీవన సౌలభ్యాన్ని సులభతరం చేస్తుందని ఆయన అన్నారు. ప్రజలు సుమారు 1000 ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డును తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవలసిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో ఆధార సూపర్ వైసర్. దేశగాని నాగరాజు, ఏ ఎస్ ఓ నాగేష్ పాల్గొన్నారు.