కేసీఆర్ పాలనలో దగాపడ్డ ఉద్యోగులు

Submitted by Degala shankar on Sun, 25/09/2022 - 14:56
Employees who lied during KCR regime

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 24, (ప్రజా జ్యోతి)..//.. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి  గ్రామాలలో విఆర్ఎ వ్యవస్థ రాష్ట్రానికి సేవాలందిస్తుందని, ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయి, స్వరాష్ట్రంలో నైనా బతుకులు బాగుపడతాయనుకుంటే కేసీఆర్ పాలనలో కేవలం మొండిచెయ్యి లభించిందని, తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగులు దగాపడ్డారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ అర్బన్, రురల్ మండలాల్లో  నిర్వహిస్తున్న విఆర్ఎ ల నిరవధిక నిరాహారదీక్ష లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ స్వయాన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గత 62 రోజులుగా నిరాహారదీక్ష లు చేస్తున్నా కనీసం స్పందించకుండ నిరంకుశ ధోరణి ప్రదర్షిస్తున్నారన్నారు, రెవెన్యూ వ్యవస్థకు మూలస్థంబాలైన VRA వ్యవస్థను పట్టించుకోవడం లేదన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా పే స్కెల్, మిగతా వసతులు కల్పించాలన్న న్యాయమైన డిమాండ్లను బేషరతుగా పరిష్కరించాలని అన్నారు. విఆర్ఎ ల న్యాయబద్ధమైన పోరాటంలో బీజేపీ ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు  అంకత్ రమేష్, అధినత్, దినేష్ మటోలియా, లోకా ప్రవీణ్ రెడ్డి, జ్యోతి రెడ్డి ముకుందరావు కార్యకర్తలు పాల్గొన్నారు.