ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన..

Submitted by shaikmohammadrafi on Fri, 30/09/2022 - 11:37
Elected as the President of the Press Club for the second time.


నడిగూడెం, సెప్టెంబర్ 28, ప్రజాజ్యోతి: నడిగూడెం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా దున్న శ్రీనివాస్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.   గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన  అత్యవసర సమావేశం లో  నూతన కమిటీని ఎన్నుకోవడం  జరిగింది.ఈ సందర్భంగా నడిగూడెం మండల ప్రెస్ క్లబ్  అధ్యక్షుడిగా ఎన్నికకు సహకరించిన  పాత్రికేయ  కృతజ్ఞతలు  తెలియజేశారు. ఎన్నికైన అనంతరం మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు, హక్కులపై రాజీలేని పోరాటం నిర్వహిస్తానని అన్నారు.గౌరవ సలహాదారులుగా షాకిర్ అలీ బేగ్ , అధ్యక్షుడిగా  దున్న శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా  పసుపులేటి సందీప్, తంగేళ్ల లింగయ్య, మహమ్మద్ రఫీ,  ప్రధాన కార్యదర్శిగా నెమ్మది రమేష్, సహాయ కార్యదర్శులుగా మందుల రాంబాబు, కుంచం ఉపేందర్,పోలంపల్లి నరసింహారావు, కోశాధికారి చిరందాస్ ప్రభాకర్ చారి, ఆర్గనైజర్స్  నోముల బుచ్చయ్య,పులి లక్ష్మణ్, షేక్ రఫీ, కార్యవర్గ సభ్యులుగా వేపూరి సుధీర్, చారాల వెంకటాచారి, చలం, మొగలగాని  వెంకటేశ్వర్లు, బాణాల  అబ్రహం , నాగేష్ ,లను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు.