ఎమ్మెల్యే గాదరి దిష్టిబొమ్మ దగ్ధం

Submitted by Upender Bukka on Sat, 01/10/2022 - 11:18
Effigy of MLA Gadari burnt

నాగారం  30 సెప్టెంబర్ (ప్రజా జ్యోతి) ,./// బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై  తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం నాగారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.  ఈ సందర్భంగా నాగారం బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఎర్ర రాంబాబు మాట్లాడుతూ కేసిఆర్ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని వాక్యానించినప్పుడు , స్పందించని ఎమ్మెల్యే గాదరి కిషోర్ నేడు ,ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. 8 సంవత్సరాలుగా తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా రౌడీ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. బహుజనులకు రాజ్యాధికారం అందించడం కోసం వారి హక్కుల సాధన కు  తన ఐ. పి. ఎస్. పదవికి రాజీనామా చేసి ప్రతి పల్లేకి  వెళుతున్న త్యాగశీలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించడం సరికాదని పేర్కోన్నారు. కెసిఆర్ రాజ్యాంగాన్ని మార్చడం కాదని ప్రజలే కేసీఆర్ పాలనను మారుస్తారని అన్నారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని   బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు . లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఇన్చార్జి రవి, కమటం శోభ, దాసరి శ్రవణ్ కుమార్, బాలస్వామి ,రింగు శేఖర్, మాగి చింటూ తదితరులు పాల్గొన్నారు.