కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

Submitted by lenin guduru on Sat, 29/10/2022 - 11:20
Edr

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

దేవరుప్పుల, అక్టోబర్ 29,  ప్రజాజ్యోతి:-
జనగామ జిల్లా
దేవరుప్పుల మండల కేంద్రములోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో  బల్లి పడ్డ ఆహారం తిని తీవ్ర అసస్వత గురైన విద్యార్థినిలను శుక్రవారం  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఘటనకు కారకులైన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్, డిఈఓ రాము, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, ఇదునురి రమాదేవి నర్సింహా రెడ్డి, బిల్ల అంజమ్మ, ఆలకుంట్ల యాదగిరి, రత్నాకర్ రెడ్డి, తెరాసా మండల అధికార ప్రతినిధి సుడిగెల హనుమంతు, తాటిపాల్లి మహేష్, తదితరులు పాల్గొన్నారు.