హలియా,సెప్టెంబర్2(ప్రజా జ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు యడవల్లి నరేందర్ రెడ్డి అన్నారు.ఆధివారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డులో బతుకమ్మ చీరలు ఆడపడుచులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి సామరస్యానికి పరమత సహనానికి మహిళలందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నారు..ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ నెంబర్ చాపల సైదులు,కొత్తపల్లి సొసైటీ డైరెక్టర్ నల్లబోతు వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
- 5 views