మల్దకల్ తిమ్మప్ప స్వామికి వెండి వితరణ

Submitted by bheemaraidu on Sat, 01/10/2022 - 13:16
Distribution of silver to Maldakal Thimmappa Swamy

గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి, వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఆర్.ఎన్ బీచుపల్లి అనంతమ్మ దంపతులు 250 గ్రాముల వెండిని స్వామికి బహుకరించారు. శుక్రవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు కు అందజేయగా, వారికి ఘనంగా సన్మానం చేశారు. దేవాలయంలో వెండి తొడుగు కోసం 108 కిలోల వెండిని సేకరించే పనిలో భాగంగా, ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి భక్తుల నుండి సేకరిస్తున్నట్టు తెలిపారు.