అక్రమాలపై చైర్మన్ నిలదీస్తున్న డైరెక్టర్లు.

Submitted by shaikmohammadrafi on Sat, 01/10/2022 - 11:13
Directors protesting the chairman on irregularities.

నడిగూడెం, సెప్టెంబర్ 30, ప్రజా జ్యోతి:  మండలంలోని తెల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం శుక్రవారం నిర్వహించిన జనసభలో చైర్మన్ బుర్ర వెంకటేశ్వర్లు మాట్లాడుతుండగా సంఘంలో జరిగిన అవకతవకల పట్ల కొందరు డైరెక్టర్లు ప్రశ్నించారు ఈనెల 27 పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయగా డైరెక్టర్లు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవటం వలన కోరం లేక పాలకవర్గ సమావేశాలు  నిర్వహించలేదు. నిర్వహించకుండా జనసభ ఎలా నిర్వహిస్తారని సమావేశం నుండి మినిట్స్,ఏజెండా రికార్డులను డైరెక్టర్లు తీసుకెళ్లారని సంఘ సీఈవో ప్రభాకర్ రావు విలేకరుల సమావేశంలో తెలిపారు . గత పాలకవర్గం చెర్మన్, సీఈఓ లు సంఘము నుండి భూమి లేనివారికి, శనిపోయినవారి పేరున సుమారు రెండు కోట్ల రూపాయలు వరకు  అనర్హులకు ఎల్ టీ రుణాలను మంజూరు చేసి  సంఘాన్ని నష్టాల బాటలో నిలిపారన్నారు వీటి విషయమై డి సి ఓ కు ఫిర్యాదు చేసినట్లు సీఈఓ తెలిపారు..