టెలికాం ఆపరేటర్ల ధర్నా

Submitted by sai teja on Wed, 28/09/2022 - 09:21
Dharna of telecom operators

, సెప్టెంబర్ 27(ప్రజా జ్యోతి):  ఖమ్మం-కోదాడ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మండల పరిధిలోని శాంతినగర్ గ్రామం వద్ద ప్లే ఓవర్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామీణప్రాంత ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన, కేబుల్ కంపెనీలు (బిఎస్ఎన్ఎల్ , ఎయిర్టెల్ ,రిలయన్స్, జియో, ఐడియా,) సంబంధించిన కేబుల్స్ ను తొలగించాలని రోడ్డు నిర్మాణం చేపడుతున్న అదాని కంపెనీ టీం సభ్యులు బెదిరిస్తున్నారని కేబుల్ ఆపరేటర్లు వాపోతున్నారు. గత 20 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నామని, ఇప్పటికిప్పుడు కేబుల్స్ తొలగించాలంటే ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నించారు. వెంటనే కేబుల్స్ తొలగించాలనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ,లేని పక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాను తీవ్రతరం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేబుల్ ఆపరేటర్లు హెచ్చరించారు.