పాఠశాలను సందర్శించిన డీఈవో

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 13:13
 DEO visited the school

మునుగోడు సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి):  మండల పరిధిలో ఉన్న ఊకోండి  గ్రామ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యా శాఖాధికారి డిఈఓ బిక్షపతి సందర్శించి పాఠశాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కోరారు . మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు సంబంధించిన తరగతి గదులను మరియు ప్రహరీ గోడను పరిశీలించి వీటికి సంబంధించిన మరమత్తులను త్వరగా పూర్తిచేసి పాఠశాల సిబ్బందికి అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడింపల్లి. యాదయ్య పంచాయతీ కార్యదర్శి జానకి రాములు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.