సీనియర్ జర్నలిస్టు రవీందర్ రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపం.

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 13:02
Deep mourning over the death of senior journalist Ravinder Reddy.

అచ్చంపేట. అక్టోబర్ 2 ప్రజా జ్యోతి.  సీనియర్ జర్నలిస్టు అనంత రవీందర్ రెడ్డి అనారోగ్యం గుండెపోటుతో ఆదివారం హైదరాబాద్ లోని శ్రీకర్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు ఈ సందర్భంగా అచ్చంపేట పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు రవీందర్ రెడ్డి సుదీర్ఘకాలంగా జీవిత దినపత్రికలో పనిచేసి ప్రస్తుతం ఆంధ్రప్రభ దినపత్రికలో అచ్చంపేట ఆర్సి ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందు నాయక్ మాట్లాడుతూ జర్నలిస్టుగా రవీందర్ రెడ్డి సమాజానికి ఎంతో సేవ చేశారని అనతి కాలంలో ఆయన గుండెపోటుతో మృతి చెందడం జర్నలిస్టులోకానికి తీరని లోటని అన్నారు . అదేవిధంగా జర్నలిస్టులందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని కుటుంబ  సభ్యుల పట్ల కూడా ఆయన అన్నారు సోమవారం రవీందర్ రెడ్డి సొంత గ్రామమైన బల్మూరులో దహన సంస్కారాలు ఉంటాయని జర్నలిస్టు సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బండారి శ్రీనివాసులు కాలూరి శ్రీను వెంకటేష్ శ్రీనివాసులు శ్రీధర్ నిరంజన్ గౌడ్ సుధాకర్ బాలిశ్వర్ ఆంజనేయులు ఏక్బాల్. తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్నివాళులు అర్పిస్తున్న జర్నలిస్టులు.