లలిత త్రిపురసుందరిదేవి అలంకరణ..కనకదుర్గ అమ్మవారు

Submitted by venkat reddy on Fri, 30/09/2022 - 16:33
Decoration of Lalita Tripurasundari..Mother of Kanakadurga

నిడమనూరు, సెప్టెంబర్30(ప్రజాజ్యోతి):  తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమై ఐదొవ రోజుకు చేరుకుంది.శుక్రవారం  కనకదుర్గమ్మ అమ్మవారు లలిత త్రిపురసుందరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి వేడుకలు ఐదొవ రోజుకు కొనసాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో రాజన్నగూడెం,నారమ్మగూడెం‌,తుమ్మడం రేగులగడ్డ గ్రామాల్లోని కనకదుర్గమ్మ ఆలయం భక్తులకు మహ అద్బుతంగా దర్శనమిస్తున్నాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి స్వర్ణకలశ  తొలి దుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు నవరాత్రుల్లో దుర్గామాత తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో దర్శనం ఇస్తుంది. ఆశ్వీయుజ శుద్ధ  పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తున్నారు. శుక్రవారం లలిత త్రిపురసుందరిదేవి అలంకరణలో భక్తులకు కనకదుర్గమ్మ వారు దర్శనమిచ్చారు. ఆరోవ రోజు మహలక్ష్మీఅవతారం, ఏడోవ రోజు సరస్వతి దేవి,ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదొవ రోజు మహిషాసురమర్థిని అలంకరణ సాయంత్రం శివ పార్వతుల శాంతికళ్యాణం,ఉరేగింపు భక్తులను అనుగ్రహిస్తారు.దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఏడాది కూడా భక్తులు  అధిక సంఖ్యలోవస్తారని అంచనా అధికారులు వేశారు. అందుకు తగ్గట్టుగానే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలు సిద్ధం చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ,మోహన్ శర్మ, రాజన్నగూడెం ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.