దళిత బంధు నిరుపేదల జీవితాల్లో వెలుగు

Submitted by Upender Bukka on Sat, 24/09/2022 - 13:02
 Dalit Bandhu is a light in the lives of the poor

ప్రజా జ్యోతి తిరుమలగిరి 23 సెప్టెంబర్..///.దళిత బంధు పథకం పేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని తిరుమలగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తిరుమలగిరి పట్టణంలో  లబ్ది దారుడు బండి పెళ్ళి ఉప్పలమ్మ దళిత బంధు యూనిట్ కింద నెలకొల్పిన కిరాణం షాపును ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్ర గణేష్ ,జగన్,. బాబురావు, పరమేష్, నాగరాజు, రాకేష్ ,శ్రీకాంత్, వేణు, ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.