చిల్లర రాజకీయాలతో విమర్శిస్తే సహించేదిలేదు..జిల్లా కాంగ్రేస్ ఉపాధ్యక్షుడు,దుర్గయ్య.

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 16:44
 Criticism with petty politics will not be tolerated.. District Congress Vice President, Durgaiah.

మహాదేవపూర్. సెప్టెంబర్20 ప్రజాజ్యోతి.../కసాయిమనిషికి నిర్వచనం పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు నే అని జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు మంచినీళ్ల దుర్గయ్య అన్నారు. మంగళవారం నాడు మహాదేవపూర్ లో పాత్రికేయుల సమావేశంలోఆయన మాట్లాడుతూ మంథని ఎమ్మేల్యే శ్రీధర్ బాబు పై పుట్టమధు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా ఖండించారు.ప్రేమతో ప్రజలకు దగ్గర కావాలి కానీ చిల్లర రాజకీయాలతో విమర్శనలు చేయడం అది పుట్ట మధు కే సాధ్యం మని అన్నారు.చిన్న కాళేశ్వరం నిర్లక్ష్యం చేసింది నువ్వు  మీ ప్రభుత్వంమేనని విమర్శించారు. మంథని నియోజకవర్గనికి చుక్క నీరు ఇవ్వని కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినప్పుడే ఈ నియోజకవర్గపై నీకు ఏపాటి సిత్తశుద్ది ఉందో నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని ఎద్దేవాచేశారు. గతంలో పుట్ట మధు ఎమ్మెల్యే గా ఉన్నపుడు ప్రజలకు సేవ చేయకుండానే ప్రభుత్వం నుండి రెండు లక్షల జీతం  తీసుకొని ప్రజలకు ఏమి లాభం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు,జడ్పీ ఛైర్మన్ హోదాలో వుంటూ లక్ష రూపాయల జీతంఎలా తీసుకుంటున్నావని ప్రశ్నించారు,మా నాయకుడు వచ్చే జీతాన్ని  మంథని, కాటారం లో  నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్ పెట్టించి మూడు సంవత్సరాల జీతాన్ని అ విద్యార్థులు జీవితాల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆలోచన చేసాడని అన్నారు.

గతంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తో అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి  మూడేండ్లు అయినా పంటలు నష్టపోయిన రైతులకు ఏఒక్క రూపాయలు ఇప్పించలేకపోయావని అన్నారు.భూపాలపల్లి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది  అది జిల్లాలో ఎక్కడైనా ఐదు మండలాల్లో పెట్టించే దమ్ముంటే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి  జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షలు అన్నారం ఎంపీటీసీ మంచినీళ్ళ దుర్గయ్య ,ఎస్సిసెల్ మండల అధ్యక్షులు లేతకరి రాజబాబు మాజీ ఎంపీటీసీ కాల్వ గంగన్న పాల్గోన్నారు.