హలియా,సెప్టెంబర్30(ప్రజా జ్యోతి): తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 03న హాలియాలో జరిగే దళిత బంధువుల ఐక్య మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పోలే రవి తెలిపారు.శుక్రవారం హాలియా మున్సిపాలిటీలో మహాసభ కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న కుల వ్యవస్థను రూపుమాపడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.విద్య,వైద్య ఉద్యోగ,రాజకీయ వ్యవస్థలో దళితులకు తగిన గౌరవం దక్కేలా సంఘం పోరాటం చేస్తుందని తెలియజేశారు. కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లో దళితుల అభివృద్ధికి ప్రకటించే నిధులు వారికే తోడ్పడాలని డిమాండ్ చేశారు.హలియాలో నిర్వహించ బోయే దళిత బంధువుల ఐక్య మహాసభకు అధిక సంఖ్యలో దళితులు పాల్గొని పార్టీలకతీతంగా విజయవంతం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో లింగాల ప్రభాకర్,మేదరి శంకర్, ఆది మల్ల సత్యనారాయణ, దుబ్బా కోటేష్,పోలే ప్రసాద్, ధర్మవరపు కొండల్,ఆడెపు బాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- 1 view