గుబ్బల మంగమ్మ ఆలయానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి

Submitted by Tirumalashetty… on Sun, 11/09/2022 - 17:46
Come to the gobbala mangamma temple can care fully follow

గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి

అశ్వారావుపేట, సెప్టెంబర్11, ప్రజాజ్యోతి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహిమాన్విత గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం చుట్టుపక్కల వాగులు పొంగిపొర్లుతున్న దృష్ట్యా భక్తులు జాగ్రత్తలు పాటించాలని కమిటీ సభ్యులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వారు విడుదల చేసిన ప్రకటనలో మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో ఆలయం ఉండడం చుట్టుపక్కల వాగులు ఎక్కువగా ఉండటంతో భారీ వర్షాల వలన అవి పొంగిపొర్లుతున్నాయని, ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు