అభాగ్యులకు అండగా...ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి

Submitted by Sathish Kammampati on Wed, 07/09/2022 - 15:33
CM's relief fund as financial security for the unfortunate

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 
నల్లగొండ సెప్టెంబర్ 07, (ప్రజాజ్యోతి)   
అభాగ్యులకు అండగాఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.బుదవారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకిరేకల్, కేతపల్లి, కట్టంగూర్ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన 70మందికి రూ.23లక్షల 11వెయిల 500 రూపాయల  సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన  చెక్కులను బాధితులకి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూపేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది అన్ని అన్నారు.ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ అదుకుంటుంది అని ఆయన తెలిపారు.

మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుంది,బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి అనిఆయన అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు దేశానికి ఆదర్శం అని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు.అభివృద్ధి లో, సంక్షేమంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ ఫలం ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయన్నారు.