సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్

Submitted by arigenagaraju on Thu, 08/09/2022 - 15:16
CM Relief Fund is a boon for the poor MLA Dr. Gadari Kishore Kumar

ప్రజా జ్యోతి తిరుమలగిరి టౌన్ ; సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం అని తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం తిరుమలగిరి క్యాంపు కార్యాలయంలో తుంగతుర్తి నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని  ప్రజలందరూ సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు .

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్టణ పేదలకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులో తేవడానికి బస్తీ దవఖానాలను  ఏర్పాటు చేసి ప్రతి  బస్తీ దవఖాన ద్వార రోజుకు 5000 నుండి 10000 రోగులకు  మెరుగైన వైద్య  సేవలందిస్తున్నామని తెలిపారు. 104, 108 వాహనాలను  ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేసి  చికిత్సలు  అందిస్తున్నామని పేర్కొన్నారు.

అదేవిధంగా కోవిడ్ సమయంలో కోవిడ్ 19 బాధితులకు చికిత్స చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిండ్రోమిక్ విధానాన్ని అవలంబించిందని దీనివలన రోగుల పరీక్ష ఫలితాల కోసం వేచి చూడకుండా వ్యాధి లక్షణాల ఆధారంగా చికిత్స అందించామని   అన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి కోఆర్డినేటర్ రజాక్ ,ఎంపీపీలు, జడ్పిటిసిలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.