అనుమానిత వ్యక్తులు గ్రామాలలో సంచారిస్తే సమాచారం ఇవ్వండి సీఐ కిరణ్

Submitted by srinivas on Sun, 25/09/2022 - 14:37
CI Kiran informs if suspicious persons roam in villages

పలిమెల  ప్రజాజ్యోతి  సెప్టెంబర్ 24..//.. కమ్యునిటీ కాంటాక్ట్ లో భాగంగా పలిమెల మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో మహదేవపూర్ సి ఐ కిరణ్ మరియు పలిమెల ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కమ్యునిటీ కాంటాక్ట్ లో భాగంగా గ్రామస్తులతో సమావేషమై మవోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. మావోయిస్టుల ఫోటోలు కలిగిన వాల్ పోస్టర్ చూపిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించినా సహాయ పడినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో కొత్త లేదా అనుమానిత వ్యక్తులు తారసపడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువకులతో మాట్లాడుతూ వాలీబాల్ క్రీడా పోటీలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. జట్ల వారీగా పోలీస్ స్టేషన్ లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి ఐ కిరణ్, పలిమెల ఎస్సై అరుణ్ కుమార్, సివిల్ మరియు సీఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.