ఆటో ఢీకొని చిన్నారి మృతి

Submitted by krishna swamy on Thu, 01/09/2022 - 18:35
A child died after being hit by an auto

యాదాద్రి(సెప్టెంబర్ 01)వలిగొండ ప్రజాజ్యోతి న్యూస్: టాటా ఏసి వాహనం ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని జాలుకాల్వ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.పోలీసులు,గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జాలుకాల్వ గ్రామానికి చెందిన బొడ్డు లింగస్వామి భవానిల ఏకైక కూతురు సితార (5) ఆ గ్రామంలోని వినాయక మంటపం వద్దకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా  అటుగా వెళుతున్న టాటా ఏసి ఢీకొని మృతి చెందింది.

మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వాహన యజమాని కళ్లెం శ్రీ రాములు ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులు,బంధువులు,గ్రామస్థులు ఆందోళన చేయగా రామన్నపేట సిఐ మోతీరాం,వలిగొండ,ఆత్మకూరు ఎం,మోత్కూర్ ఎస్సై లు ప్రభాకర్,మధు,రామంజన్ రెడ్డి లు రంగప్రవేశం చేసి మృతురాలి కుటుంబానికి  న్యాయం జరిగెటట్లు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.మృతురాలి తండ్రి లింగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు.