ఘనంగా మహాత్మ గాంధీ జయంతి వేడుకలు

Submitted by mallesh on Mon, 03/10/2022 - 11:54
Celebrating Mahatma Gandhi's birth anniversary

చౌటుప్పల్ అక్టోబర్ ( ప్రజా జ్యోతి):  భారత దేశానికి స్వతంత్రం సాధించడం కోసం ఎన్నో కష్టాలు అవమానాలు భరించి, అహింసతోనే ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించిన వీరుడు జాతిపిత మహాత్మా గాంధీ అని ఎల్లాగిరి సర్పంచ్ రిక్కల ఇందిరా సత్తిరెడ్డి అన్నారు.ఆదివారం ఎల్లాగిరి గ్రామపంచాయతీ ఆవరణంలో మాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి సర్పంచ్ ఇందిరా సత్తిరెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిరెడ్డి బుచ్చిరెడ్డి, కొత్త యాదయ్య, శ్యామ పద్మ, కొత్త సంతోష, మారగోని పద్మ ,కందగట్ల యాదిరెడ్డి మెట్టు నర్సిరెడ్డి ,లక్ష్మీబాయి, కందగట్ల పద్మా రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.